న్యూఢిల్లీ : ఐదు రోజుల పర్యటన కోసం భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవానే గురువారం బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లారు. విషయాన్ని అదనపు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్, ఐహెచ్క్యూ ఆఫ్ ఎండీఓ తెలిపింది. రక్షణ సహకారాన్ని, బలమైన ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంపొందించడం ఈ పర్యటన లక్ష్యమని ట్వీట్ చేసింది. ఈ నెల 4న ‘శాంతిర్ ఒగ్రోషేనా-2021’ (ఫ్రంట్ రన్నర్ ఆఫ్ ది పీస్) సైనిక విన్యాసంలో పాల్గొనేందుకు భారత సైన్యం ప్రతినిధి బృందం ఢాకాకు చేరుకుంది.
బంగబంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ జన్మ శతాబ్ది ఉత్సవాలు, బంగ్లాదేశ్ స్వాతంత్య్ర దినోత్సవ స్వర్ణోత్సవం సందర్భంగా ఏప్రిల్ 4-12 నుంచి ప్రదర్శనలు జరుగనున్నాయి. పర్యటనలో భాగంగా ఈ నెల 11న ఆర్మీ చీఫ్ బంగ్లా విదేశాంగ మంత్రితో సమావేశం కానున్నారు. అక్కడ యూఎన్ శాంతి సహాయ కార్యకలాపాలపై జరిగే సెమినార్కు హాజరై, ప్రసంగించనున్నారు. అలాగే మాలి, దక్షిణ సూడాన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లోని ఐక్యరాజ్యసమితి మిషన్ ఫోర్స్ కమాండర్లు, రాయల్ భూటానీస్ ఆర్మీ డిప్యూటీ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్తో ఈ నెల 12 సంభాషించనున్నారు.
నెల రోజుల్లోనే.. 79 వేల మంది చిన్నారులకు కరోనా