మామిళ్లగూడెం, ఏప్రిల్ 18 : లోక్సభ ఎన్నికల ఈవీఎంల రవాణా కోసం పకడ్బందీ కార్యాచరణ చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ సంబంధిత అధికారులకు సూచించారు. ఈవీఎంల రవాణా, స్ట్రాంగ్ రూంలలో ఏర్పాట్లపై ఐడీవోసీలో గురువారం నిర్వహించిన అధికారుల సమీక్షలో ఆయన మాట్లాడారు. ఆయా గోదాము నుంచి సెగ్మెంట్ల వారీగా కేటాయించిన ఈవీఎంలను ఆయా సెగ్మెంట్లలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు జాగ్రత్తగా రవాణా చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, ట్రైనీ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, ఇతర అధికారులు రాజేశ్వరి, ఆఫ్రిన్, సత్యనారాయణ, పవిత్ర, మదన్గోపాల్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.