హైదరాబాద్: రాయలసీమ ఎత్తిపోతల పథకం కోర్టు ధిక్కరణ కేసులో ఎన్జీటి చెన్నై బెంచ్లో వాదనలు ముగిశాయి. కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకునే అధికారం ఎన్జీటికి ఉందని వాదించిన పిటిషనర్ తరపు న్యాయవాది. ఎన్జీటి చట్టంలోని సెక్షన్ 26, 28ల కింద చర్యలు తీసుకోవచ్చని కోర్టుకు విన్నవించారు. ఈ నెల 30న ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదిత్యనాథ్ దాస్ రిటైర్ అవుతున్నందున ఈ లోగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కేసును తప్పుదోవ పట్టించేలా సీఎస్ అఫిడవిట్లు వేశారు. అయితే ఈ విషయంపై ఈ నెల 27న తెలంగాణ వాదనలు వినిపించనున్నది. తరువాత ఈ కేసులో ఎన్జీటి తీర్పు ఇవ్వనున్నది. ఎన్జీటి అధికారాలపై పలు సందర్భాల్లో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పులను పిటిషనర్ తరఫు న్యాయవాది కే శ్రవణ్ కుమార్ ఉటంకించారు. తీర్పు ఉల్లంఘనలు జరిగినప్పుడు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్జీటి తీర్పు ఉల్లంఘనలు చేస్తే నేరుగా జైలుకు పంపిన సందర్భాలు రానప్పటికీ ఇప్పుడు స్పష్టంగా ఉల్లంఘనలు కనిపిస్తున్నందువల్ల చర్యలు తీసుకోవాలని కోరారు. టీఎన్ శేషన్ వచ్చే వరకూ ఎన్నికల కమిషన్కు ఉన్న అధికారులు ఎవరికీ తెలియలేదని, ఆయన వచ్చాక ప్రక్షాళన ప్రారంభం అయిందని పిటిషనర్ తరఫు న్యాయవాది వివరించారు. అదే విధంగా ఎన్జీటికి ఉన్న అధికారాన్ని అమలు చేయాలని న్యాయవాది శ్రావణ్ కుమార్ కోరారు.