Srisailam | శ్రీశైలం దేవస్థానానికి ఏపీ గ్రామీణ బ్యాంకు మహేంద్ర బొలోరో వాహనాన్ని విరాళంగా సమర్పించారు. గంగాధర మండపం వద్ద ఈ మహేంద్ర బొలోరో వాహనాన్ని, సంబంధిత పత్రాలను ఈవో ఎం.శ్రీనివాసరావుకు ఏపీ గ్రామీణ బ్యాంకు, శ్రీశైలం బ్రాంచి బ్యాంక్ చైర్మన్ పీవీకే ప్రమోద్ కుమార్ రెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా ఏపీ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ మాట్లాడుతూ.. రూ.11.50 లక్షలతో కొనుగోలు చేసిన మహేంద్ర బొలోరో వాహనాన్ని దేవస్థానానికి అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముందుగా ఈవో, అర్చకస్వాములు వాహన పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ గ్రామీణ బ్యాంక్ రీజినల్ మేనేజర్ పీవీ రమణ, శ్రీశైలం బ్రాంచి మేనేజర్ కే.సుబ్రహ్మణ్యం, సంబంధిత బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. అలాగే స్వామివారి ప్రధాన అర్చకులు శివప్రసాద్ స్వామి, దేవస్థాన పర్యవేక్షకులు డి.నాగేశ్వరరావు, దేవస్థానం ముఖ్య భద్రతా అధికారి బి.శ్రీనివాసరావు, ట్రాన్స్పోర్టు విభాగం వర్క్ ఇన్స్పెక్టర్ ఎం.శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.