Anushka shetty New Movie | ఒకప్పుడు చాలా బిజీగా ఉన్న అనుష్క శెట్టి రెండు మూడేండ్లుగా సినిమాలు పెద్దగా చేయడం లేదు. ప్రస్తుతం ఈమె చేతిలో ఒక్క సినిమా మాత్రమే ఉంది. అనుష్క, జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేసిన ఈ సినిమా గురించి ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి ఇప్పుడు బయటకొచ్చింది.
యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఇప్పటికే అనుష్క శెట్టి రెండు సినిమాలు చేసింది. 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి.. 2018లో భాగమతి సినిమాలు ఈ బ్యానర్లోనే వచ్చాయి. ఈ రెండు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో తనదైన నటనతో అనుష్క మెప్పించింది. తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ ఒకేసారి విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకుంది. దీంతో ఇప్పుడు ఇదే బ్యానర్పై మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది అనుష్క శెట్టి. ఈ సినిమాకు మహేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 4 నుంచి ప్రారంభం కానుంది.
అనుష్క అభిమానులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఏ మాత్రం హడావిడి లేకుండా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో అనుష్క సరికొత్త లుక్లో కనిపించనుంది. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. త్వరలోనే ఈ సినిమా టైటిల్ను దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించనున్నారు. భాగమతి సినిమా తెలుగుతో పాటు సౌతిండియన్ భాషల్లో తెరకెక్కించారు. ఇప్పుడు ఈ సినిమాను కూడా పాన్ ఇండియన్ స్థాయిలో అన్ని భాషల్లో తెరకెక్కించనున్నట్లు సమాచారం.
“Prabhas | ఆ స్టార్ హీరోయిన్ మరోసారి ప్రభాస్తో కలిసి నటించనుందా?”
“Anushka Shetty | అనుష్క కేవలం వారితోనే సినిమా చేస్తుందట..!”
“అరుంధతి సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్స్ ఎవరో తెలుసా..?”
Anushka | ఇన్నేండ్లు అయినా అనుష్క క్రేజ్ ఏమాత్రం తగ్గలేదుగా..”