తిరుపతి : న్యూఢిల్లీలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో మే 21 నుంచి 29వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు (Annual Brahmotsavam) నిర్వహిస్తున్నామని టీటీడీ (TTD ) అధికారులు వివరించారు. మే 20న సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. బ్రహ్మోత్సవాలకు ముందు మే 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మే 21న ధ్వజారోహణంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు .
బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయని వివరించారు. 21వ తేదీ ఉదయం ధ్వజారోహణం (Dwajarohanam) , రాత్రి పెద్దశేష వాహనం, 22న ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనంపై స్వామివారు విహరిస్తారని పేర్కొన్నారు. 23 న ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపుపందిరి వాహనం, 24న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం, 25న ఉదయం మోహినీ అవతారం, సాయంత్రం కల్యాణోత్సవం, రాత్రి గరుడ (Garuda) వాహనంపై స్వామివారు ఊరేగుతారని తెలిపారు.
26న ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజవాహనం, 27న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 28న ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహనం, 29న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజారోహణంతో ఉత్సవాలు మగుస్తాయని తెలిపారు.