హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో 12,122 అంగన్వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలు లేవని, అద్దె భవనాల్లో నడుస్తున్నాయని కేంద్రం తెలిపింది. అయితే వాటి నిర్మాణాలకు నిధులివ్వడం లేదని, సమీప ప్రభుత్వ పాఠశాలలకు తరలించాలని సూచించింది.
టీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్ శుక్రవారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి ఉపాధి హామీ, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్స్ (ఆర్ఐడీఎఫ్), ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన పథకం కింద నిధులు విడుదల చేశామని తెలిపారు. అద్దె భవనాల అంగన్వాడీలకు కనీస సౌకర్యాలు లేకుంటే దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలలకు మార్చాలని సూచించారు.