ముంబై, ఏప్రిల్ 24: మతపరమైన హింస, అల్లరి మూకల నుంచి దేశ రాజధాని ఢిల్లీని రక్షించడంలో కేంద్ర హోంమంత్రి అమిత్షా విఫలమయ్యారని ఎన్సీ పీ అధ్యక్షుడు శరద్ పవార్ విమర్శించారు. ఢిల్లీ పోలీసులు హోంశాఖ అధీనంలో ఉంటారని, రాజధానిలో ఏవిధమైన అవాంఛనీయ ఘటనలు జరిగినా ప్రపంచానికి తెలిసిపోతుందని, తద్వారా ఢిల్లీలో అశాంతి నెలకొందనే అభిప్రాయం ఏర్పడుతుందని అన్నారు.
ఢిల్లీలో ఇటీవల అల్లర్లు జరిగిన జహంగీర్పురి ప్రాంతంలో ఆదివారం హిందువులు, ముస్లింలు కలిసి తిరంగా యాత్రను నిర్వహించారు. అందరం ఒక్కటేనంటూ ఐక్యతను చాటారు.