ముంబై : మహారాష్ట్రతో పాటు ముంబై నగరంలో పెరుగుతున్న కొవిడ్ కేసులతో వెస్ట్రన్ రైల్వే అప్రమత్తమైంది. అహ్మదాబాద్ – ముంబై – అహ్మదాబాద్ తేజస్ రైలును శుక్రవారం నుంచి నెల రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు వెస్ట్రన్ రైల్వే డివిజనల్ మేనేజర్ తెలిపారు. రైలు నడిచే రెండు రాష్ట్రాల్లోనూ నైట్ కర్ఫ్యూ అమలులో ఉందని, దీంతో సాధారణ ప్రయాణికులకు అసౌకర్యం కలిగే అవకాశం ఉందని ఐఆర్సీటీసీకి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. ఈ ఏడాద్రి ఫిబ్రవరి 14 నుంచి ముంబై సెంట్రల్ – అహ్మదాబాద్ తేజస్ ఎక్స్ప్రెస్ సేవలను వారానికి నాలుగు రోజుల చొప్పున అధికారులు తిరిగి ప్రారంభించారు. కరోనా మహమ్మారి కారణంగా సరైన ఆక్యుపెన్సీ లేకపోవడంతో గతేడాది నవంబర్ 24 నుంచి తేజస్ రైలును అధికారులు రద్దు చేశారు.
దేశంలో 6.75 కోట్ల డోసుల కొవిడ్ టీకా పంపిణీ