కారేపల్లి, మార్చి 27 : ఖమ్మం జిల్లా సింగరేణి మండలం పొలంపల్లి గ్రామానికి చెందిన జవాన్ బానోత్ దశరథ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకుంటూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. లేహ్–లడాక్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న దశరథ్ అక్కడి సోనం హాస్పిటల్ లో ఓ మహిళకు అత్యవసరంగా AB పాజిటివ్ రక్తం అవసరం ఏర్పడగా తనది అదే గ్రూప్ రక్తం కావడంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లి రక్తదానం చేశాడు. దీంతో వైద్యులు సదరు మహిళకు చికిత్స అందించి ప్రాణాలను కాపాడగలిగారు. దశరథ్ సేవలకు తోటి సైనికులు, ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు.