న్యూఢిల్లీ : ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తూ పొరుగు దేశాల్లో అలజడి రేపడంలో పాకిస్తాన్ (Pakistan) పేరొందిన సంగతి తెలిసిందే. పాక్ కుయుక్తులకు భారత్ ఏ స్ధాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నదీ ప్రపంచం చూస్తూనే ఉంది. ఇక ఉగ్రవాదం, గాడిదల ఎగుమతులకు తోడు పాకిస్తాన్ ఇప్పుడు యాచకులనూ ఎగుమతి చేస్తోంది. బెగ్గర్లను దేశం దాటించడాన్ని మానుకోవాలని సౌదీ అరేబియా, ఇరాక్ వంటి దేశాలు పాకిస్తాన్ను అభ్యర్ధించడం పరిస్ధితి తీవ్రతకు అద్దం పడుతోంది.
దీనికి తోడు మక్కా మసీదు ప్రాంగణంలో అరెస్టయ్యే జేబు దొంగల్లోఅత్యధికులు పాకిస్తానీలే. ద్రవ్యోల్బణం చుక్కలు చూస్తుండటంతో ఆహారం, ఇంధన ధరలు పైపైకి ఎగబాకుతుండటంతో పాకిస్తాన్లో పేదల పరిస్ధితి దయనీయంగా మారింది. పాక్ నుంచి యాచకులు పశ్చిమాసియా దేశాల బాట పడుతున్నారు. యాత్రికుల పేరుతో తమ దేశాలకు వస్తున్న పాకిస్తానీలు ఆపై యాచకలుగా మారుతున్నారని, ఇరాక్, సౌదీ అరేబియా దౌత్యవేత్తలు పాకిస్తాన్కు నివేదించారు. ఇక ఓవర్సీస్ పాకిస్తానీస్ స్టాండింగ్ కమిటీ కూడా ఇటీవల ఈ పరిస్ధితులపై ఆందోళన వ్యక్తం చేసింది.
పశ్చిమాసియా దేశాల్లో అదుపులోకి తీసుకున్న యాచకుల్లో 90 శాతం మంది పాకిస్తానీలే కావడం గమనార్హం. వీరంతా ప్రస్తుతం ఇరాక్, సౌదీ అరేబియా జైళ్లలో మగ్గుతున్నారని ఓవర్సీస్ పాకిస్తానీల సెక్రటరీ జీషన్ ఖాన్జదా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోటి మంది పాకిస్తానీలు వివిధ దేశాల్లో నివసిస్తుండగా వీరిలో గణనీయ సంఖ్యలో యాచక వృత్తిలో ఉన్నారని జీషన్ వివరించారు. ఆర్ధిక వ్యవస్ధ కుదేలై ఇప్పటికే సంక్షోభం ఎదుర్కొంటున్న పాకిస్తాన్కు మధ్య ప్రాచ్య దేశాల్లో తమ పౌరులు యాచకులుగా మారడం కొత్త తలనొప్పి తెచ్చిపెడుతోంది. ఆర్ధిక స్ధిరత్వం సాధించేందుకు వ్యవసాయం, రియల్ ఎస్టేట్పై పన్నులు విధించి వృధా ఖర్చులు తగ్గించాలని పాకిస్తాన్ను ప్రపంచ బ్యాంక్ కోరింది.
Read More :
Rajasthan | కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాదిలో 27వ ఘటన