టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో నటించిన చిత్రం కార్తికేయ 2 (Karthikeya 2). చందూ మొండేటి (Chandoo Mondeti) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 12న విడుదల కావాల్సి ఉండగా..ఎవరూ ఊహించని విధంగా ఒక రోజు ముందుకు జరిపి ఆగస్టు 13న రిలీజ్ చేశారు. ఈ వాయిదా విషయంలో దిల్ రాజు ఉన్నారంటూ కొన్ని మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై కార్తికేయ 2 సక్సెస్ మీట్లో క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు (Dil Raju).
ఇక్కడ ఎవరూ సినిమాలను తొక్కేయడం ఉండదని దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. తనకు సినిమా ఇంటే ఇష్టమని, మంచి సినిమాలను ప్రోత్సహించే వారిలో మొదటి వ్యక్తిని తానేనని అన్నారు దిల్ రాజు. కార్తికేయ 2 వాయిదా పడ్డ సమయంలో కొన్ని మీడియా పోర్టల్స్, ఛానల్స్ తన పేరును తెరపైకి తీసుకొచ్చాయని, ఆర్టికల్స్ ప్రచురించే, ప్రసారం చేసే ముందు నిజానిజాలను క్రాస్ చెక్ చేసుకోవాలని దిల్ రాజు సూచించారు.
రెండు పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ కార్తికేయ 2 మంచి వసూళ్లను రాబడుతుందని చెప్పారు. హ్యాపీ డేస్ రోజుల నుండి తనకు నిఖిల్ తెలుసునని, డైరెక్టర్, నిఖిల్ను నివాసంలో కలిశానని చెప్పుకొచ్చారు. విడుదల తేదీల విషయంపై ప్రతీది చర్చించామని, ఆరోగ్యకరమైన వాతావరణంలోనే సినిమాలు విడుదలయ్యాయన్నారు దిల్ రాజు.
ఈ చిత్రంలో కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. కార్తికేయ 2లో శ్రీనివాస్ రెడ్డి, బాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ అనుపమ్ఖేర్, ఆదిత్యా మీనన్, హర్ష చెముడు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కాలభైరవ అందించిన మ్యూజిక్ బ్యాక్ బోన్గా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
Read Also :Godfather | ‘గాడ్ ఫాదర్’ కొత్త అప్డేట్..బర్త్ డే ట్రీట్కు చిరు రెడీ..!
Read Also : Dulquer Salmaan | దుల్కర్ సల్మాన్ ఫేవరేట్ తెలుగు హీరో ఇతడేనట..!
Read Also :Vassishta | అబ్బాయితో సక్సెస్..త్వరలోనే బాబాయితో కూడా..!