ఖైరతాబాద్, సెప్టెంబర్ 7: రోడ్డు ప్రమాదంలో ఓ పారిశుధ్య కార్మికురాలు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. సైఫాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిమల్కాపూర్కు చెంది న రేణుక(42) 15 ఏండ్లుగా జీహెచ్ఎంసీ గోషామహల్ సర్కిల్లో ఔట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నది.
దీనిలో భాగంగానే ఆదివారం ఉదయం బషీర్బాగ్ నుంచి లిబర్టీకి వెళ్తుండగా ప్రమాదవశాత్తు టస్కర్ చక్రాల కింద పడిపోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే స్థానిక దవాఖానకు తరలించగా, ఆమె అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. టస్కర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, జీహెచ్ఎంసీ కార్మికురాలు రేణుక మృతిపై నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ ఆర్వీ కర్నణ్ ఆరా తీశారు. ఆమె మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. రేణుక కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.