హుజూరాబాద్ : అయ్యా! ఈటల రాజేందర్గారు మా ఊరిని మండలం చేయాలని అడిగినం. మీరు స్పందించలేదు. మీరు మీ స్వలాభం కోసం దళితుల భూమిని ఆక్రమించుకుని, దానివల్ల మీరు రాజీనామా చేసి ఈ రోజు బై ఎలక్షన్లు తీసుకువచ్చిండ్లు. మీరు మాకు ఎమ్మెల్యేగా, మంత్రిగా.. మా ఊరిని, మా మండలాన్ని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిందేం లేదు.
మేం మండలం కోసం నిరాహార దీక్ష చేసినం, రాస్తారోకో చేసినం. ఆ రోజు మీరు పోలీస్ బెటాలియన్తో మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసిండ్లు తప్ప మమ్మల్ని ఎన్నడూ పట్టించుకున్నది లేదు. అందుకే మా వావిలాల గ్రామం నుంచి మీకు రాజకీయ సమాధి కడుతాం. ఇది గుర్తించుకోండి.
-ఉడుత సాయి తేజ, వావిలాల గ్రామం, జమ్మికుంట మండలం
గెల్లు శ్రీనన్నను గెలిపించుకుంటం
దళితబంధు ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతామని నమ్మకం ఉంది. వాటిని పదింతలు చేసి చూపిస్తం . మాలో ఉన్న విశ్వాసం అది. సంక్షేమ పథకాలను ఇలాగే అమలు చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అసలు మరిచిపోం. గెల్లు శ్రీనన్న ను గెలిపించుకుంటం.
–రాజు, ధర్మరాజు పల్లి గ్రామం, హుజూరాబాద్ మండలం