మహబూబాబాద్ : మహబూబాబాద్(Mahabubabad) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. హార్వెస్టర్(Harvester) కిందపడి ఓ వ్యక్తి మృతి(Person died) చెందాడు. ఈ విషాదకర సంఘటన మరిపెడ మండలంలోని గాలివారిగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరి పంట కోస్తుండగా ప్రమాదవశాత్తు హార్వెస్టర్ కిందపడి గాలివారిగూడెం గ్రామ శివారు టిలావత్ తండాకు చెందిన టిలావత్ వెంకన్న(36) మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వెంకన్న మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.