Prathinidhi-2 Movie | టాలీవుడ్ హీరో నారా రోహిత్ చాలా రోజుల తర్వాత నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రతినిధి 2’. తొమ్మిదేళ్ల కిందట ఆయన హీరోగా చేసిన ప్రతినిధి సినిమాకు సీక్వెల్గా ఈ సినిమా వస్తుంది. సీనియర్ జర్నలిస్ట్ మూర్తి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇక ఈ చిత్రంలో నారా రోహిత్ సమకాలీన రాజకీయాలపై ప్రశ్నలు సంధించే జర్నలిస్ట్ పాత్రలో అలరించనున్నాడు. అయితే ఈ సినిమాను మొదట ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఏపీలో ఎన్నికల వాతావరణం నేపథ్యంలో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. అయితే తాజాగా కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను మే 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. వానరా ఎంటర్టైన్మెంట్స్ & రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు.