నల్లగొండ : నల్లగొండ(Nallagonda) పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణా రెడ్డి(Kancharla Krishna Reddy) ప్రచారంలో జోరు పెంచారు. పొద్దున లేచింది మొదులు సాయంత్రం వరకు ఇల్లిల్లు తిరుగుతూ ప్రచారంలో చేస్తున్నారు. ఆదివారం నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కాలేజ్ మైదానంలో తెల్లవారుజామున మార్నింగ్ వాకర్స్ర్స్తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా కలిసి ఓటు అభ్యర్థించారు.
అనంతరం టీ కొట్టులో టీ తయారు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్(BRS) గెలుపుతోనే తెలంగాణకు న్యాయం జరుగుతుందన్నారు. ఢిల్లీలో తెలంగాణ గొంతుక వినిపించాలంటే కారు గుర్తుకే ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డితో, మాజీ మార్కెట్ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, లోడంగి గోవర్ధన్, మెరుగు గోపి, రావుల శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.