హైదరాబాద్ : జీడిమెట్ల పరిధిలోని హెచ్ఎంటీ ప్రాంతంలో విషాదం నెలకొంది. ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉరేసుకున్న వ్యక్తిని మార్నింగ్ వాకర్స్ గుర్తించి జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని కుత్బుల్లాపూర్కు చెందిన సాయికుమార్(35)గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.