INDIA alliance | దేశ రాజధాని ఢిల్లీలో నేడు(సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు ‘ఇండియా జన్ బంధన్’(ఇండీ కూటమి) కీలక సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి 23 పార్టీల నేతలు హాజరు కానున్నట్లు సమాచారం. ఇటీవల దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత తొలిసారిగా ఇండీ కూటమి నేతలు సమావేశం అవుతున్నారు. త్వరలో పలు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై నేతలు చర్చించనున్నారు. ఈ సమావేశంలో తృణమూల్ పార్టీ చీఫ్, మమతా బెనర్జీ హాజరై ఇటీవల పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను వివరించనున్నట్లు తెలిసింది.
అయితే, డీఎంకే ఈ సమావేశాన్ని బహిష్కరించింది. ఇటీవల తమిళనాడు ఎన్నికల తర్వాత మిత్ర ధర్మం పాటించకుండా కాంగ్రెస్ పార్టీ టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చింది. దీంతో ఆగ్రహించిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కాంగ్రెస్తో పొత్తును తెగతెంపులు చేసుకున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ డీఎంకే నమ్మక ద్రోహం చేసిందని భవిష్యత్లో ఆ పార్టీతో కలిసే ప్రసక్తే లేదని కుండబద్ధలు కొట్టారు. మరోవైపు టీవీకే పార్టీకి కూడా ఈ సమావేశానికి సమాచారం లేదని తెలిసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ వివరణ ఇస్తూ వివిధల పార్టీలకు ఎంపీల ఆధారంగానే సమావేశానికి ఆహ్వానిస్తున్నామని వివరణ ఇచ్చింది.