మహబూబ్నగర్ : శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆభరణాల ఊరేగింపు వైభవంగా జరిగింది, ఆదివారం ఆత్మకూరు ఎస్బీఐ నుంచి దేవస్థానం వరకు జరిగిన ఊరేగింపులో ఆలయ చైర్మన్, ఆభరణాలు తలపై పెట్టుకుని బయలుదేరుగా వెంట వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్, జడ్పీటీసీ రాజేశ్వరి రాములతోపాటు వివిధ పార్టీల నేతలు అధికారులు పాల్గొన్నారు.
అనంతరం స్వామివారికి ఆభరణాలు అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం జరిగే ఉద్దాల ఉత్సవానికి భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వందలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు.