రాజన్న సిరిసిల్ల : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ యువకుడిని కత్తులతో పొడిచి హతమార్చారు. ఈ విషాదకర సంఘటన చందుర్తి మండలం మాల్యాల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పడిగేలా నరేష్ (25) అనే యువకుడు వారం రోజుల క్రితమే దుబాయి నుంచి స్వగ్రామానికి వచ్చాడు.
కాగా, అతడిని గురువారం గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి వివాహేతర సంబంధమే కారణమని స్థానికంగా చర్చించుకుంటున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న సీఐ సీఐ కిరణ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.