బోయినపల్లి, జూలై 11: బోయినపల్లి మండలం మానువాడ ఎస్సారార్ జలాశయానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వరదకాలువ ద్వారా వరద నీటిని అధికారులు విడుదల చేశారు.
ఆదివారం రాత్రి 10 వేల క్యూసెక్కులు విడుదల చేయగా, సోమవారం ఎస్సారార్ జలాశయంలో చేరినట్లు చెప్పారు. అలాగే వరదల ద్వారా 833 క్యూసెక్కులు వస్తున్నట్లు తెలిపారు.