రాంచీ: కరోనా కారణంగా మరో రాష్ట్రం లాక్డౌన్లోకి వెళ్లిపోతోంది. ఈ నెల 22 నుంచి 29 వరకు 8 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించింది జార్ఖండ్. ఇప్పటికే ఢిల్లీలో 6 రోజుల లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. అత్యవసర సేవలకు మాత్రమే జార్ఖండ్లో అనుమతించారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 3992 కేసులు నమోదయ్యాయి. దీంతో జార్ఖండ్లో మొత్తం కేసులు సంఖ్య 1.62 లక్షలు దాటింది. ప్రస్తుతం 30,477 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో లాక్డౌన్ విధిస్తున్నట్లు హేమంత్ సోరెన్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. అత్యవసర సేవలకు మినహాయింపు ఇవ్వడంతోపాటు ప్రార్థనా మందిరాలు తెరిచే ఉంటాయని ప్రకటించినా.. పెద్ద సంఖ్యలో గుమిగూడవద్దని స్పష్టం చేసింది. ఈ మధ్య బంగ్లాదేశ్ నుంచి 50 వేల రెమ్డెసివిర్ దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని జార్ఖండ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.