హైదరాబాద్: పదో తగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లోనూ అమ్మాయిల హవా కొనసాగింది. సప్లిమెంటరీ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన విడుదల చేశారు. మొత్తం 79.82 శాతం మంది ఉత్తీర్ణులవగా, వారిలో 78.42 శాతం మంది బాలురు, 82.21 శాతం మంది బాలికలు ఉన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఆగస్టు 1 నుంచి 10 వరకు నిర్వహించారు. వీటికోసం 55,663 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 48,167 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 38,447 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 14,614 మంది అమ్మాయిలు, 23,833 మంది అబ్బాయిలు ఉన్నారు. కాగా, 97.99 శాతం ఉత్తీర్ణతతో సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో నిలువగా, 53.11 శాతంతో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉంది.