లక్నో : ఉత్తరప్రదేశ్ సీతాపూర్లో భారీ వర్షాలకు గోడకూలి ఏడుగురు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలవగా.. వారిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. సీతాపూర్లోని మన్పూర్ పోలీస్స్టేషన్ ప్రాంతంలోని లక్ష్మణ్నగర్లో బుధవారం తెల్లవారు జామున ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. రక్షించి వారిని సీతాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతున్నారు. సదర్పూర్లో దంపతులు నిద్రిస్తున్న సమయంలో వారిపై ఇంటిగోడ కూలగా.. ఇద్దరు మృత్యువాతపడ్డారు. బిలోలి గ్రామంలో గోడ కూలిన ఘటనలో మరో వ్యక్తి మరణించాడు. ఆయా ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ఇండ్లు దెబ్బతిని ఇంటి పైకప్పులు, గోడలు కూలిపోయాయని పోలీసులు తెలిపారు.