హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తేతెలంగాణ): మండల మాజీ అధ్యక్షులు, జిల్లా సీనియర్ నేలతకు 60% నామినేటెడ్ పదవులు ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్టు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ తెలిపారు. గత మండలాల పార్టీ అధ్యక్షులకు, జిల్లా కార్యవర్గాల్లో పనిచేసిన వారికి, అనుబంధ సంఘాల నాయకులకు, నియోజకవర్గ సీనియర్ నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు.
ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం మహేశ్కుమార్ గౌడ్తో గాంధీభవన్లో భేటీ అయ్యారు. పీఏసీఎస్ డైరెక్టర్లు, చైర్మన్లు, పలు నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించి విధివిధానాలను రూపొందించారు. ఇన్చార్జి మంత్రి జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గాల్లో కంటెస్టెడ్ అభ్యర్థులు సీనియర్ నాయకులతో సమావేశమై, సమన్వయంతో ఆశావహుల నివేదిక రూపొందించాలని నిర్ణయించారు.