హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో యాప్ ఆధారిత అగ్రిగేటర్ రవాణా సేవలను మరింత సురక్షితంగా, పారదర్శకంగా, ప్రయాణికులకు అనుకూలంగా తీర్చిదిద్దేందుకు ‘సమగ్ర తెలంగాణ మోటర్ వాహన అగ్రిగేటర్’ పాలసీ రూపకల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ పాల సీ రూపకల్పన కోసం సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేసినట్టు మంత్రి పేరొన్నారు. కమిటీ ఇప్పటికే అగ్రిగేటర్ సంస్థలు, డ్రైవర్లు, వాహన యజమానులు, ప్రభుత్వ శాఖలు తదితర భాగస్వాములతో విస్తృతంగా సంప్రదింపులు నిర్వహించినట్టు తెలిపారు. కమిటీ సిఫార్సులను సమగ్రంగా పరిశీలించి పాలసీని అమలుచేయనున్నట్టు తెలిపారు.