జైపూర్ : ప్రాక్టికల్ కోసం తిరిగి ఇనిస్టిట్యూట్కు తిరిగి వచ్చిన రాజస్థాన్లోని ఐఐటీ జోధ్పూర్కు చెందిన 52 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. గుజరాత్, ఒడిశాకు చెందిన విద్యార్థులు సొంత పట్టణాల్లో ఆన్లైన్ తరగతులకు హాజరయ్యారు. తప్పనిసరిగా ప్రాక్టికల్స్ కోసం తప్పనిసరిగా ప్రయోగశాలకు హాజరు కావాల్సి ఉండగా.. ఇనిస్టిట్యూట్కు తిరిగి వచ్చారు. ఈ క్రమంలో వారం రోజుల్లో 52 మంది వైరస్కు పాజిటివ్గా పరీక్షించారు.
దీంతో అధికారులు విద్యార్థులందరినీ ఐఐటీ క్యాంపస్లోని ఓ హాస్టల్లో భవనంలో ఐసోలేషన్లో ఉంచారు. ఈ సందర్భంగా ఐఐటీ ప్రతినిధి అమర్దీప్ శర్మ మాట్లాడుతూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. వైరస్ బారినపడ్డ, పడని విద్యార్థులు వేర్వేరు భవనాల్లో పేర్కొన్నారు. వైరస్ కట్టడికి అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పెద్ద ఎత్తున విద్యార్థులు వైరస్కు పాజిటివ్గా పరీక్షలు చేయడంతో జోధ్పూర్ డివిజనల్ కమిషనర్ రాజేశ్ శర్మ, డిప్యూటీ డైరెక్టర్ (మెడికల్, హెల్త్) సునీల్కుమార్ బిష్ట్ క్యాంపస్ను సందర్శించి, ఐఐటీ పరిపాలన చేసిన ఏర్పాట్లను సమీక్షించారు.
ఇంటి నుంచి వచ్చే ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా పది రోజుల సెల్ఫ్ ఐసోలేషన్లో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. ఐఐటీ పరిధిలో 11 హాస్టల్ భవనాలు ఉండగా.. విద్యార్థులు ప్రాక్టికల్ కోసం భవనాల్లోకి రావడం వైరస్ మరింత మందికి సోకే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఈ క్రమంలో వైరస్ కట్టడికి పరిపాలన శానిటేషన్ చేయడంతో పాటు అన్ని చర్యలు చేపడుతోంది.