జమ్మికుంట: హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. గెల్లు శ్రీనివాస్యాదవ్కు తాము తోడుంటామంటూ యువత గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారు. జమ్మికుంట పట్టణ టీఆర్ఎస్ విద్యార్థి, యూత్ విభాగాలతో మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలపై వారికి దిశానిర్దేశం చేశారు. అనంతరం 50 మంది బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరగా, వారికి మంత్రి కొప్పుల ఈశ్వర్ గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. యువకులంతా గడపగడపకూ తిరుగుతూ గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలుపుకోసం కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, టీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు టంగుటూరి రాజ్కుమార్, పొనగంటి మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.