లక్నో: ఉత్తరప్రదేశ్లోని లక్నోలో( Lucknow) అర్ధరాత్రి భారీ భూకంపం వచ్చింది. శనివారం తెల్లవారుజామున 1.12 గంటల సమయంలో లక్నోలో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదయిందని వెల్లడించింది. భూకంప కేంద్రం లక్నోకు 139 కిలోమీటర్ల దూరంలో ఉందని, భూ అంతర్భాగంలో 82 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొన్నది. అర్ధరాత్రి వేళ భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.
Earthquake of Magnitude:5.2, Occurred on 20-08-2022, 01:12:47 IST, Lat: 28.07 & Long: 81.25, Depth: 82 Km ,Location: 139km NNE of Lucknow, Uttar Pradesh, India for more information Download the BhooKamp App https://t.co/4JI5H8kFoA@Indiametdept @ndmaindia pic.twitter.com/QlaEgrtsSF
— National Center for Seismology (@NCS_Earthquake) August 19, 2022
శుక్రవారం మధ్యాహ్నం ఉత్తరాఖండ్లోని పితోరాగ్రాఫ్లో కూడా భూకంపం వచ్చింది. మధ్యాహ్నం 12.55 గంటలకు పితోరాగ్రాఫ్లో 3.6 తీవ్రతతో భూమి కంపించిందని ఎన్సీఎస్ తెలిపింది. జమ్ముకశ్మీర్లోని హన్లేలో కూడా భూమి కంపించింది. దీని తీవ్రత 3.1గా నమోదయిందని వెల్లడించింది.