గౌహతి: శివసేనకు చెందిన రెబల్స్ ఎమ్మెల్యేలు గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్లో బస చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రకు చెందిన 42 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు అక్కడే క్యాంప్ పెట్టారు. శివసేన మంత్రి ఏక్నాథ్ షిండేతో కలిసి వాళ్లంతా బల ప్రదర్శన చేపట్టారు. హోటల్లో ఏక్నాథ్తో పాటు మొత్తం 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంట్లో శివసేనకు చెందిన 35 మంది, స్వతంత్య్రులు ఏడు మంది ఉన్నారు. రెబల్స్కు చెందిన వీడియోను కాసేపటి క్రితం రిలీజ్ చేశారు. షిండే సాబ్ తుమ్ ఆగే బడో.. హమ్ తుమ్హారే సాత్ హై అంటూ రెబల్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.
ఇక సీఎం ఉద్దవ్ గ్యాంగ్లో కేవలం 13 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నట్లు తెలిసింది. అస్సాం వెళ్లిన ఎమ్మెల్యేలు ముంబై వచ్చిన తర్వాత తమతోనే ఉంటారని ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. తమతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నట్లు ఆయన చెప్పారు.
#WATCH | Assam | 42 rebel MLAs from Maharashtra – 35 from Shiv Sena and 7 Independent MLAs – seen together at Radisson Blu Hotel in Guwahati.#MaharashtraPoliticalCrisis pic.twitter.com/6MPgq42a3V
— ANI (@ANI) June 23, 2022