తిరుమల : సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది . 6 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి ఉన్నారు. వీరికి దర్శనం 4 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని 64,823 మంది భక్తులు దర్శించుకోగా 22,890 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.03 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.