సంగారెడ్డి : పటాన్ చెరు మండలం ఇస్నాపూర్లో విషాదం నెలకొంది. ఓ బహుళ అంతస్తుల భవనంలో ఉతికి ఆరేసిన బట్టలు.. పక్కనే ఉన్న విద్యుతీగలపై పడ్డాయి. ఓ వ్యక్తి ఆ బట్టలను రాడ్తో తీసేందుకు యత్నించాడు. దీంతో అతను కరెంట్ షాక్తో ప్రాణాలు కోల్పోయాడు. సదరు వ్యక్తి పక్కన నిలబడి ఉన్న చిన్నారి కూడా విద్యుదాఘాతంతో మృతి చెందింది. పాపను కాపాడేందుకు యత్నించిన మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.