ముంబై : తౌటే తుఫాను ధాటికి ముంబై సమీపంలో అరేబియా సముద్రంలో రెండు ఓడలు కొట్టుకుపోయాయి. ఇందులో 410 మంది గల్లంతవగా.. ఇప్పటి వరకు 146 మందిని రక్షించినట్లు భారత నావికాదళం మంగళవారం తెలిపింది. మిగతా వారిని సైతం రక్షించేందుకు సహాయక చర్యలు చేపడుతున్నట్లు నేవీ పేర్కొంది. తౌటే అతి తీవ్ర తుఫానుగా మారగా.. భారీగా గాలులు వీశాయి. దీంతో ముంబై తీరంలో ఉన్న రెండు ఓడలు కొట్టుకుపోయాయి. సమాచారం అందుకున్న నేవీ తన మూడు యుద్ధ నౌకలను మోహరించింది. ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ కొచ్చి, ఐఎన్ఎల్ తల్వార్ నౌకలతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. బార్జ్ పీ 305 నౌక నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 146 మందిని నేవీ రక్షించింది.
ఇందులో 111 మందిని ఐఎన్ఎస్ కొచ్చి, ఐఎన్ఎస్ కోల్కతా, 17 మందిని ఆఫ్షోర్ సపోర్ట్ వెసెల్ (ఓఎస్వీ) గ్రేట్షిప్ అహిల్య, 18 మందిని ఓఎస్వి ఓషన్ ఎనర్జీ రక్షించాయి. 273 మందితో ఉన్న బార్జ్ పీ 305 నౌక సోమారం బొంబాయి హై ఏరియాలోని హీరా ఆయిల్ ప్రాంతం నుంచి సముద్రంలో కొట్టుకుపోయింది. మిగతా సిబ్బంది కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ కార్యకలాపాలు రాత్రిపూట సైతం కొనసాగాయని నేవీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ ప్రయత్నంలోనే ఐఎన్ఎస్ కోల్కతా లైఫ్ జాకెట్లతో ప్రాణాలతో బయటపడిన మరో ఇద్దరిని రక్షించిందని పేర్కొన్నారు. గాల్ కన్స్ట్రక్టర్కు చెందిన మరో బార్జ్ ముంబయి తీరంనుంచి కొట్టుకుపోగా.. ఇందులో అందులో 137 మంది సిబ్బంది ఉన్నారు.