న్యూఢిల్లీ, మే 17: కరోనా టీకా కారణంగా దేశంలో ఇప్పటివరకూ 26 కేసుల్లో రక్తస్రావం, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వంటి దుష్పరిణామాలను గుర్తించినట్టు నేషనల్ అడ్వర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ కమిటీ (ఏఈఎఫ్ఐ) పేర్కొంది. అయితే బ్రిటన్, జర్మనీ తదితర దేశాలతో పోల్చితే మనవద్ద ఈ కేసులు నామమాత్రమేనని స్పష్టం చేసింది. కొవిడ్-19 వ్యాక్సినేషన్ అనంతరం తలెత్తే దుష్పరిణామాలను అంచనా వేసేందుకు ఏఈఎఫ్ఐ ప్యానెల్ను కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన ‘కొవిషీల్డ్’ టీకా వేసుకున్న వారిలోనే ఈ సమస్యలు తలెత్తినట్టు ప్యానెల్ తెలిపింది.
దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నా టి నుంచి ఇప్పటివరకూ 23,000 కేసుల్లో కొన్ని సమస్యలు తలెత్తినట్టు గుర్తించారు. ఇందులో 700 కేసులను ప్రాథమికంగా సీరియస్ కేటగిరీలోకి చేర్చారు. అనంతరం వీటిపై లోతైన సమీక్ష నిర్వహించి 498 కేసులను తీవ్రమైనవిగా గుర్తించారు. ఇందులో 26 కేసుల్లో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం లేదా రక్తస్రావం వంటి సమస్యలు తలెత్తినట్టు ధ్రువీకరించారు. వ్యాక్సినేషన్లో భాగంగా ‘కొవిషీల్డ్’ టీకా వేసుకున్న వారి లో ఈ పరిణామాలు ఎదురైనట్టు నిపుణు లు చెప్పారు. ‘కొవాగ్జిన్’ విషయంలో ఇలాంటి సమస్యలు ఎదురుకాలేదన్నారు. ఏఈఎఫ్ఐ కమిటీ అధ్యయనం ప్రకారం.. ఏప్రిల్ 3 నాటికి దేశంలో 7.54 కోట్ల డోసు ల టీకాలు వేయగా.. వీటిలో కొవిషీల్డ్ డోసు లు 6.86 కోట్లుకాగా.. కొవాగ్జిన్ డోసులు 67 లక్షలు. భారత్లో 10 లక్షల డోసులకు సగటున 0.61 కేసుల్లోనే సమస్యలు తలెత్తుతున్నట్లు తేలింది. బ్రిటన్లో ఇది నాలు గు కేసులుగా, జర్మనీలో 10 కేసులుగా ఉం ది. ఈ లెక్కన విదేశాలతో పోల్చితే భారత్ లో టీకాతో సమస్యలు తలెత్తటం నామమాత్రమేనని ఏఈఎఫ్ఐ వెల్లడించింది.