శక్కర్నగర్/వినాయక్నగర్/కంఠేశ్వర్, ఫిబ్రవరి 11: మున్సిపల్ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు యత్నించి పలువురు పట్టుబడ్డారు. బోధన్లో 12 మంది, నిజామాబాద్లో ఒకరిని అదుపులోకి తీసుకుని, వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బోధన్లోని రెండు పోలింగ్ కేంద్రాల్లో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన ఇరువురిని గుర్తించిన పోలింగ్ సిబ్బంది వారిని పోలీసులకు అప్పగించారు. ఇలా బోధన్లో మొత్తం 9 మంది మహిళలను, ముగ్గురు పురుషులను పోలీసులకు అప్పగించారు. వీరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ వెంకట నారాయణ వెల్లడించారు. నిజామాబాద్లో ఓ యువతి దొంగ ఓటు వేయడానికి ప్రయత్నించగా, పోలింగ్ సిబ్బంది గుర్తించి ఆమెను పోలీసులకు అప్పగించారు. ఖిల్లా రోడ్డులో గల గోల్డెన్ జూబ్లీ విద్యాసంస్థలోని పోలింగ్ స్టేషన్కు వచ్చిన ఓ యువతి దొంగ ఓటు వేయడానికి ప్రయత్నించగా, పోలింగ్ సిబ్బంది గుర్తించి పోలీసులకు అప్పగించారు. సదరు యువతి పై కేసు నమోదు చేసినట్లు రెండో టౌన్ ఎస్సై సయ్యద్ ముజాహిద్ తెలిపారు.