బెంగళూరు: క్రికెట్ అభిమానులకు కర్ణాటక ప్రభుత్వం తీపి కబురు అందించింది. భారత్, శ్రీలంక మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈనెల 12 నుంచి జరుగనున్న రెండో టెస్టుకు పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు అనుమతినిచ్చింది. ఈ మేరకు కర్ణాటక క్రికెట్ సంఘం (కేఎస్సీఏ) గురువారం ఓ ప్రకటన చేసింది. మొహలీ వేదికగా జరిగిన తొలి టెస్టుకు 50 శాతం ప్రేక్షకులను అనుమతించగా.. ఈ మ్యాచ్కు వంద శాతం అనుమతిస్తున్నారు.