హైదరాబాద్, జనవరి 30 : జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆదివారం పలువురు ప్రముఖులు అసెంబ్లీ ఆవరణలోని ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసనమండలి చైర్మన్ ప్రొటెం సయ్యద్ అమినుల్ హసన్ జాఫ్రీ, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, మండలిలో విప్ ఎమ్మెస్ ప్రభాకర్రావు, శాసనసభ కార్యదర్శి డాక్టర్ వీ నర్సింహాచార్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతిపిత ఆచరించిన సత్యం, అహింసా విధానాలు ప్రపంచానికి మార్గదర్శనం చేస్తాయని పేర్కొన్నారు. ఆధునిక ప్రపంచానికి శాంతి సందేశం అందించిన గొప్ప దార్శనికుడు మహాత్మాగాంధీ అని, ఆ మహనీయుడు చూపిన మార్గం అందరికీ శిరోధార్యమని శ్లాఘించారు.