తెలంగాణ స్వరాష్ట్రంలో పాలమూరు పల్లెల ముఖ చిత్రాలు సంపూర్ణంగా మారుతున్నాయి. పాలమూరు పల్లెలు కోనసీమను తలపిస్తున్నాయి. నాడు నీళ్లులేక నోళ్లెండబెట్టిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పల్లెలు.. నేడు పుడమికి పచ్చని రంగేసిట్లు ఎటు చూసినా పల్లెలకు పచ్చని తోరణం కట్టినట్లుగా కనువిందు చేస్తున్నాయి. నాడు వలస కూలీలను తరలించేందుకు బస్సులు పల్లెల నుంచి పట్నం బాట పట్టేవి.
ఇప్పుడు పల్లె వెలుగు బస్సులు పట్నం నుంచి పల్లె బాట పడుతున్నాయి. కనుచూపు మేర పచ్చని పంట పొలాలు, జలకళను సంతరించుకున్న చెరువులు, కుంటలతో విరాజిల్లుతున్నాయి. అందుకు సజీవ సాక్ష్యమే కోయిల కొండ గ్రామం. ఈ అపురూప ఛాయా చిత్రాలను నమస్తే ఫొటోగ్రాఫర్ బందిగె గోపి తన కెమెరాలో బంధించారు.
ఇవి కూడా చదవండి..
స్కూళ్లు ఇలా మూసి ఉండటం చాలా ప్రమాదకరం.. వెంటనే తెరవండి!
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావుకు నివాళులు అర్పించిన వినోద్ కుమార్
మోదీజీ పుట్టగొడుగులు మానేసి ఐదు రోజులు ఈ ఆహారం తీసుకోండి!
ఆధ్మాత్మికతో పాటు ఆహ్లాదానికి ప్రాధాన్యం : మంత్రి ఐకే రెడ్డి
సమాజానికి దారి చూపే రచనలు రావాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్