cotton price | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు సబ్ మార్కెట్ యార్డులో సోమవారం పత్తి క్వింటాల్కు రూ.8,350 పలికింది. నిత్యం ఇక్కడికి ఆరు వేల క్వింటాళ్ల పత్తి వస్తుండటంతో యార్డు తెల్ల బంగారంతో మెరిసిపోతున్నది. ప్రస్తుతం వస్తున్న పత్తి నాణ్యత బాగుండటంతో రూ.8వేల నుంచి ధర పలికినట్టు ట్రేడర్లు చెప్తున్నారు. అత్యధిక ధరలు వస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. – జూలూరుపాడు