ఐజ్వాల్: మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ‘జోరం పీపుల్స్ మూవ్మెంట్ (ZPM)’ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నాయి. తొలిసారి పార్టీ అధికారంలోకి రావడంతో క్యాడర్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. రాష్ట్రమంతటా పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. రాజధాని ఐజ్వాల్లోని పార్టీ ప్రధాన కార్యాలయంతోపాటు ఇతర కార్యలయాలు సందడిగా మారాయి.
ఇవాళ ఐజ్వాల్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జెడ్పీఎం అధ్యక్షుడు, కాబోయే ముఖ్యమంత్రి లాల్దుహోమాతోపాటు పార్టీకి చెందిన పలువురు నాయకులు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మిజోరం ఏకైక మహిళా ఎమ్మెల్యే బారిల్ వాన్నీసంగీ (32) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మిజోరం అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్న అతిపిన్న వయస్కురాలైన మహిళా ఎమ్మెల్యేగా ఆమె గుర్తింపు పొందారు.
#WATCH | Mizoram Elections | ZPM (Zoram People’s Movement) leaders, including Baryl Vanneihsangi – the youngest woman MLA of Mizoram, participated in a worship service at the party office in Aizawl today. The party registered a landslide victory in the state elections. pic.twitter.com/ZZZRYcDOEh
— ANI (@ANI) December 5, 2023