Loksabha Elections 2024 : కాంగ్రెస్, ఎస్పీ కూటమి పట్ల ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ అన్నారు. యూపీలోని ఇటావాలో గురువారం జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ రిజర్వేషన్లకు కోత విధించి ముస్లింలకు పంచుతారని ఆరోపించారు.
దేశాన్ని ఇస్లామీకరించేందుకు, తాలిబన్ల వ్యవస్ధను అమలు చేసే క్రమంలో దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. మరోవైపు తాము మైనారిటీలకు వారు కోరుకున్న ఆహారం తీసుకునే స్వేచ్ఛ కల్పిస్తామని చెబుతున్నారని అన్నారు.
మైనారిటీలు కోరుకునేది మెజారిటీ ప్రజలకు అభ్యంతరకరమైన గోమాంసమని యోగి పేర్కొన్నారు. యూపీలో గోవధ నిషేధమని, కాంగ్రెస్-ఎస్పీ కూటమికి ఓటు వేస్తే పాపం చేసినట్టేనని అన్నారు.
Read More :
Rahul Gandhi: మిగిలింది 2 రోజులే.. ఇంకా తేల్చుకోని రాహుల్, ప్రియాంకా గాంధీ