వడోదర: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించేందుకు పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం దేశ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేశారు. ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవాలని, బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని, ఇంటి నుంచే పనిచేసే విధానాలను అవలంబించాలని, ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని, విదేశీ మారకద్రవ్యంతో ముడిపడిన అనవసర ఖర్చులను తగ్గించుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. గుజరాత్లోని వడోదరలో ఓ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ పెట్రోల్, డీజిల్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మెట్రోను ఉపయోగించండి. ఎలక్ట్రిక్ బస్సులు, ప్రజా రవాణాను ఎక్కువగా వినియోగించండి. కార్పూలింగ్ను ప్రోత్సహించండి. కారు ఉన్నవారు ఒకే వాహనంలో క్కువ మందిని తీసుకువెళ్లాలి అని ప్రధాని సూచించారు.