జైపూర్: నైట్క్లబ్లో వాగ్వాదం జరుగడంతో ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులను కారుతో ఢీకొట్టాడు. ఈ సంఘటనలో మహిళ మరణించింది. (woman run over by car) మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఈ సంఘటన జరిగింది. మధ్యప్రదేశ్కు చెందిన ఉమా సుతార్ జైపూర్లో నివాసం ఉంటోంది. ఈవెంట్ కార్యక్రమాలను ఆమె నిర్వహిస్తున్నది. మంగళవారం రాత్రి స్నేహితుడు రాజ్కుమార్తో కలిసి నైట్ క్లబ్కు ఉమా వెళ్లింది. మంగేష్ అనే వ్యక్తి తన ప్రియురాలితో కలిసి అక్కడకు వచ్చాడు. ఈ సందర్భంగా ఉమాపై కామెంట్లు చేశాడు. రాజ్కుమార్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది.
కాగా, తెల్లవారుజామున రెండు జంటలు ఆ హోటల్ నుంచి బయటకు వెళ్లే సందర్భంగా మరోసారి వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో కారు ఎక్కిన మంగేష్, స్పీడుగా ఉమా, రాజ్కుమార్ను ఢీకొట్టి పారిపోయాడు. ఈ సంఘటనలో ఉమా అక్కడికక్కడే మరణించింది. రాజ్కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి.
మరోవైపు ఈ సంఘటన అనంతరం ఇంటికి వెళ్లిన నిందితుడు మంగేష్ జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఈ నేపథ్యంలో తండ్రి, సోదరుడితో కలిసి కోర్టులో లొంగిపోయేందుకు కారులో బయలుదేరాడు. అయితే పోలీసులు మార్గమధ్యలో మంగేష్ను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆ హోటల్ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A woman was killed after she was run over by a car, following an argument at a nightclub in #Jaipur on Tuesday night. The incident was caught on camera, which showed the car driver hitting the woman before fleeing the scene. Another man was also injured in the hit-and-run. The… pic.twitter.com/VJDFEBWfsE
— Upendrra Rai (@UpendrraRai) December 27, 2023