Assaulted | కన్న బిడ్డలు లైంగిక వేధింపులకు గురవుతుంటే ఏ తల్లైనా అడ్డుకుంటుంది. వేధింపులకు పాల్పడుతున్న వారిపై శివంగిలా విరుచుకుపడుతుంది. వారిపై దాడి చేసైనా సరే తన పిల్లల్ని సంరక్షించుకుంటుంది. అయితే, కేరళ (Kerala)కు చెందిన ఓ మహిళ మాత్రం కన్నబిడ్డలపై (Minor Daughter) లైంగికదాడి చేస్తున్న ప్రియుడికి సహకరించింది. చివరకు కటకటాలపాలైంది (Woman Jailed).
తిరువనంతపురంకు చెందిన ఓ మహిళకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, భర్త మానసిక రోగి కావడంతో అతన్ని వదిలేసి పిల్లలతో విడిగా జీవిస్తోంది. ఈ క్రమంలో శిశుపాలన్ అనే వ్యక్తితో ప్రేమాయణం మొదలు పెట్టింది. ఈ క్రమంలో తరచూ అతడి ఇంటికి వెళ్లి వచ్చేది. అయితే మహిళ కూతుర్లపై కన్నేసిన శిశుపాలన్ వారిని కూడా తన ఇంటికి తీసుకురామని బలవంతం చేశాడు. దీంతో తన పిల్లల్ని కూడా అతడి వద్దకు తీసుకెళ్లింది. అక్కడ ఆ ఇద్దరు చిన్నారులపై శిశుపాలన్ అఘాయిత్యానికి పాల్పడేవాడు. 2018 – 2019 మధ్య తల్లి ఎదుటే ఆ చిన్నారులపై అనేక సార్లు ఈ దారుణానికి పాల్పడ్డాడు. అయినా ఆ మహిళ అడ్డుకోకపోగా.. ప్రియుడికి పూర్తిగా సహకరించింది.
తల్లి ప్రవర్తన.. శిశుపాలన్ లైంకిగ వేధింపులకు తట్టుకోలేక ఆ చిన్నారులు ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయి అమ్మమ్మ వద్దకు చేరారు. ఆమె పిల్లల్ని ఇద్దర్నీ బాలల సంరక్షణ కేంద్రంలోకి చేర్పించింది. అక్కడ కౌన్సిలింగ్ ఇవ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పిల్లల తల్లి, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక విచారణ సమయంలో శిశుపాలన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో కేసు విచారణలో భాగంగా కేరళ స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు (Kerala special Fast Track Court) సోమవారం తీర్పు వెలువరించింది. ఈ మేరకు పిల్లల తల్లికి 40 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించింది. అంతేకాదు రూ.20,000 జరిమానా కట్టాలని ఆదేశించింది. నిందితురాలు తన పిల్లల పట్ల వ్యవహరించిన తీరు అమ్మతనానికే అవమానకరమని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. ఆమె క్షమాపణలకు అర్హురాలు కాదని పేర్కొంది. కాగా, ఆ ఇద్దరు పిల్లలు ప్రస్తుతం బాలల సంరక్షణ గృహంలో ఉన్నారు.
Also Read..
Malla Reddy | మహేశ్బాబు బిజినెస్మ్యాన్ సినిమా చూసే రాజకీయాల్లోకి వచ్చా : మల్లారెడ్డి
Malla Reddy | వచ్చే ఐదేళ్లలో హాలీవుడ్, బాలీవుడ్ను తెలుగు ప్రజలే శాసిస్తారు : మంత్రి మల్లారెడ్డి
IPL 2024 | పాండ్యా స్థానానికి గట్టి పోటీ..? ఆ నలుగురిపై ఓ కన్నేసిన గుజరాత్