Malla Reddy | వచ్చే ఐదేళ్లలో హాలీవుడ్, బాలీవుడ్ను తెలుగు ప్రజలే శాసిస్తారని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేత, మంత్రి మల్లారెడ్డి (Chamakura Malla Reddy) అన్నారు. బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్ కూడా త్వరలో హైదరాబాద్కు షిఫ్ట్ అవుతాడని చెప్పారు. రణ్బీర్ (Ranbir Kapoor) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం యానిమల్ (Animal). కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్గా నటిస్తోంది. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహిస్తున్నాడు. యానిమల్ డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను సోమవారం హైదరాబాద్లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించారు.
ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, స్టార్ నటుడు మహేశ్బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక వీరితో పాటు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సైతం స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా అద్భుతమైన స్పీచ్తో ఆకట్టుకున్నారు. మంత్రి మాట్లాడుతూ.. ‘వచ్చే ఐదేళ్లలో హాలీవుడ్, బాలీవుడ్ను తెలుగు ప్రజలే శాసిస్తారు. రణ్బీర్ కపూర్ మీరు కూడా ఏడాది తర్వాత హైదరాబాద్కు షిఫ్ట్ అవుతారు. ఎందుకంటే ముంబై పాతబడిపోయింది. బెంగళూరు ట్రాఫిక్ ఎక్కువ. హైదరాబాద్ మాత్రమే అనువైన నగరం’ అని అన్నారు.
ఇక తెలుగు ప్రజలు చాలా స్మార్ట్ అని ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు. ‘తెలుగు వాళ్లు చాలా స్మార్ట్. మా తెలుగు దర్శకుడు రాజమౌళి, నిర్మాత దిల్ రాజ్ చాలా తెలివైన వాళ్లు. అందులోకి ఇప్పుడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా వచ్చి చేరారు. రష్మిక చాలా తెలివైనది. పుష్పతో అల్లు అర్జున్.. దుమ్మురేపాడు. ఇప్పుడు సందీప్ మరోసారి బాలీవుడ్ లో దుమ్మురేపుతాడు. ఇకపై బాలీవుడ్, హాలీవుడ్ను తెలుగు వాళ్లే శాసిస్తారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో నాలుగుసార్లు అశ్వమేధ యాగం జరిగింది. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారు. ఇక్కడ ఏ సినిమా రిలీజ్ అయినా కూడా రూ.500 కోట్లు కలెక్షన్స్ వస్తాయి. పక్కా.. ఈ సినిమా సూపర్ హిట్’ అంటూ చెప్పుకొచ్చారు. మల్లారెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
#MallaReddy Speech at #AnimalPreReleaseEvent pic.twitter.com/5s1g82BtPA
— Divya Pendyala (@divya_pendyala) November 28, 2023
యానిమల్ చిత్రంలో బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషన్ కుమార్, మురద్ ఖేతని నిర్మిస్తున్నారు.
Also Read..
Prakash Raj | ప్రకాశ్రాజ్కు బీఆర్ఎస్ రాజ్యసభ సీటు ఆఫర్ చేసిందా? ఈ ప్రచారంలో నిజమెంత?
North Korea: వైట్హౌజ్, పెంటగాన్ ఫోటోలు తీసిన ఉత్తర కొరియా శాటిలైట్ !
Virat Kohli | ముఖానికి గాయాలు.. ముక్కుపై బ్యాండేజ్.. అసలు కోహ్లీకి ఏమైంది..?