Malla Reddy | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా చూసే తాను పాలిటిక్స్లోకి వచ్చానని అన్నారు భారత రాష్ట్ర సమితి (BRS) నేత, మంత్రి మల్లారెడ్డి (Chamakura Malla Reddy). గత కొన్ని రోజులుగా తెలంగాణ ఎన్నికల ప్రచార సభల్లో బిజీ బిజీగా ఉన్న మంత్రి.. సోమవారం రాత్రి మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించిన ‘యానిమల్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన స్పీచ్తో అందరినీ ఆకట్టుకున్నారు.
‘ఈ రోజు మల్లారెడ్డి యూనివర్సిటీకి యానిమల్ చిత్ర బృందం వచ్చింది. మహేష్బాబు, రాజమౌళి, రణ్బీర్ కపూర్, అనిల్ కపూర్ వచ్చారు. మహేశ్ బాబు గారూ.. నేను మీ సినిమా బిజినెస్ మెన్ చూసే రాజకీయాల్లోకి వచ్చాను. ఆ సినిమాను పది సార్లు చూసి ఎంపీ అయ్యాను. సేమ్ మోడల్.. సేమ్ సిస్టమ్’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ మాటలు విన్న మహేశ్ నవ్వు ఆపుకోలేకపోయారు. ఇక మంత్రి స్పీచ్కు ఈవెంట్కు హాజరైన సినీ అభిమానులు సైతం ఈలలు, కేకలతో హోరెత్తించారు. ప్రస్తుతం మంత్రి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Minister Malla Reddy Says He Became A Politician After Watching Super Star Mahesh Babu
Businessman Movie#MallaReddy Speech at #AnimalPreReleaseEvent #MaheshBabu pic.twitter.com/RGcq95HWw1— Divya Pendyala (@divya_pendyala) November 28, 2023
కాగా, మంత్రి మల్లారెడ్డి.. మహేశ్ బాబుకు అభిమాని అన్న విషయం తెలిసిందే. గతంలో అనేక సార్లు ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు కూడా. మహేశ్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ ఆడియో రిలీజ్లో కూడా ఇదే విషయాన్ని ఆయన ఓపెన్గా చెప్పారు. ‘మీకో ముఖ్యమైన విషయం చెబుతున్నా. నేను మహేశ్ బాబుకు అభిమానిని. ఈరోజు నేను ఎంపీ అయ్యింది కూడా ఆయన సినిమా చూసే. సినిమాల్లో మాదిరి వాటిని ప్లాన్ చేసి.. సక్సెస్ అయ్యా. ఈ ఈవెంట్కు కూడా మహేశ్ను చూడాలన్న పట్టుదలతోనే వచ్చాను’ అంటూ గతంలో చెప్పుకొచ్చారు.
బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్ కూడా త్వరలో హైదరాబాద్కు షిఫ్ట్ అవుతాడని చెప్పారు. రణ్బీర్ (Ranbir Kapoor) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం యానిమల్ (Animal). కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్గా నటిస్తోంది. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహిస్తున్నాడు. యానిమల్ చిత్రంలో బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషన్ కుమార్, మురద్ ఖేతని నిర్మిస్తున్నారు. యానిమల్ డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను సోమవారం హైదరాబాద్లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, స్టార్ నటుడు మహేశ్బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక వీరితో పాటు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సైతం స్పెషల్ గెస్ట్గా విచ్చేసి మాట్లాడారు.
Also Read..
Malla Reddy | వచ్చే ఐదేళ్లలో హాలీవుడ్, బాలీవుడ్ను తెలుగు ప్రజలే శాసిస్తారు : మంత్రి మల్లారెడ్డి
Alia Bhatt | డబ్బు కోసం నటించాలంటే భయం వేస్తుంది.. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్