Maharashtra CM | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Elections) ఫలితాల్లో మహాయుతి (Mahayuti) కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. మొత్తం 288 స్థానాలకు గానూ 220 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఈ మేరకు ఈనెల 25న లెజిస్లేటివ్ పార్టీ సమావేశాన్ని (legislative party Meet) నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో సీఎం అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. ఆ తర్వాతి రోజు అంటే ఈనెల 26న కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
కాగా ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి కీలకమైన మెజారిటీని దాటేసింది. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 145 సీట్లు కావాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం మహాయుతి కూటమి 220 సీట్లతో ముందంజలో ఉంది. ఇందులో బీజేపీ 128 స్థానాల్లో, సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీ 55 స్థానాల్లో, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 35 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి.
ఇక ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (MVA) 51 స్థానాల్లో ఆధిక్యంతో వెనుకంజలో ఉంది. ఎంవీఏలో భాగమైన కాంగ్రెస్ పార్టీ 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) 16 స్థానాల్లో, శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ-ఎస్పీ) 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) కూడా 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
Also Read..
Maharashtra Elections | మహా పీఠం మహాయుతిదే.. కూటమి నేతల సంబరాలు షురూ
Sanjay Raut | ఇది ప్రజా తీర్పుకాదు.. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
Hyderabad | విషాదం.. శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య