Sanjay Raut | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Maharashtra result) వెలువడుతున్నాయి. ఎర్లీ ట్రెండ్ ప్రకారం మహాయుతి (Mahayuti) కూటమి అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. మ్యాజిక్ ఫిగర్ 145 స్థానాలు దాటేసి.. 221 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇందులో బీజేపీ 128 స్థానాల్లో ముందంజలో ఉంది. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ (Maha Vikas Aghadi) కూటమి కేవలం 52 స్థానాల్లో మాత్రమే ముందంజలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై శివసేన (యూటీబీ) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజా తీర్పు కాదన్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఎన్డీయే గెలుస్తోందని ఆరోపించారు.
‘ఫలితాల సరళి చూస్తుంటే ఏదో తప్పుజరిగినట్లు అనిపిస్తోంది. వాళ్లు ఏదో గోల్మాల్ చేశారు. మా సీట్ల కొన్ని దోచుకున్నారు. ఇది ప్రజల నిర్ణయం కానేకాదు. ఇక్కడ జరిగిన తప్పేంటో అందరికీ అర్థం అవుతోంది. ఈ ఫలితాలతో ప్రజలు కూడా ఏకీభవించడం లేదు. షిండేకు 60 సీట్లు, అజిత్ పవార్కు 40, బీజేపీకి 125 సీట్లు రావడం సాధ్యమేనా..? ఈ రాష్ట్ర ప్రజలు నిజాయితీ పరులు’ అని పేర్కొన్నారు.
ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందిన అభ్యర్థులు అందరూ ఆధిక్యంలో కొనసాగడంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. బాల్ థాక్రే స్థాపించిన శివసేనను చీల్చిన ఏక్ నాథ్ షిండే, ఎన్సీపీ పార్టీని చీల్చిన అజిత్ పవార్పై మరాఠా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. వారు చేసిన మోసాన్ని మహారాష్ట్ర ప్రజలు ఎలా మరిచిపోతారని అన్నారు. కొన్ని నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో తమకు స్పష్టమైన ఆధిక్యం వచ్చిందని.. ఫలితాలు ఇప్పడెలా మారాయని అనుమానం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ ప్రజా తీర్పు కాదని.. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి మహాయుతి కూటమి గెలుస్తోందని ఆరోపించారు. మహారాష్ట్రలో ప్రజాస్వామ్యం మరోసారి ఖూనీ అయిందని నిరూపితం అయిందని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.
Mumbai | As Mahayuti has crossed the halfway mark in Maharashtra, Shiv Sena UBT leader Sanjay Raut says, “From what we are seeing, it seems that something is wrong. This was not the decision of the public. Everyone will understand what is wrong here. What did they (Mahayuti) do… pic.twitter.com/COjoVJpfi3
— ANI (@ANI) November 23, 2024
Also Read..
Vande Bharat | గయాలో రెండు వందే భారత్ రైళ్లపై రాళ్ల దాడులు.. ఇద్దరు యువకులు అరెస్ట్
Jani Master | జానీ మాస్టర్ బెయిల్ రద్దు పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Hyderabad | విషాదం.. శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య