ముంబై (నమస్తే తెలంగాణ) జూలై 7: మహారాష్ట్ర రాజకీయాల్లో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ(ఎస్పీ) తాజాగా ఎన్డీఏతో చేతులు కలపబోతున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఎన్సీపీ(ఎస్పీ) విలీన ప్రతిపాదనకు మద్దతు లభించలేదనే వార్తల నేపధ్యంలో ఈ చర్చ నడుస్తున్నది.
ఎన్సీపీ(ఎస్పీ)కి చెందిన కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేCలు అధికార ఎన్డీఏ కూటమిలో చేరడంపై యోచిస్తున్నారని కథనాలు వస్తున్నాయి. ఎన్డీఏలో ఎన్సీపీ(ఎస్పీ) చేరితో ఎంపీ సుప్రియా సూలేతో పాటు కొందరు నేతలకు కేంద్రంలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. ఈ వార్తలను ఎన్సీపీ(ఎస్పీ) ఖండించింది. కాగా సీనియర్ బీజేపీ నేత వినోద్ తావ్డే, శరద్ పవార్ ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ మధ్య సమావేశం జరిగిందని సమాచారం.